నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమాలో సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.
అయితే కళ్యాణ్ రామ్ ఒక్కడితో ఇది మరింత హైప్ తెచ్చుకోవడం కష్టమే.దీంతో ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ రాబోతున్నారట.హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జులై 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.
ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నాడు.ఈ విషయాన్నీ ఇప్పటికే మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు.
ఒకే వేదికపైకి నందమూరి అన్నదమ్ములు రాబోతుండడంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చాలా విషయాలపై ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాడు అని టాక్ వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ సినిమా అయినా ఎన్టీఆర్ 30 గురించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ గురించి ఈ వేదికపై ప్రస్తావిస్తాడు అని తెలుస్తుంది.ఈ సినిమా ఎందుకు సెట్స్ మీదకు వెళ్లడం లేదు అని చెప్పే అవకాశం ఉంది.
అలాగే ఆ తర్వాత ప్రాజెక్టులు అయినా ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సినిమాల గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.







