అలనాటి తెలుగు ప్రజల అన్నగారు NTR గురించి ప్రస్తావన అవసరం లేదు.కృష్ణ జిల్లా నిమ్మకూరు అనే ప్రాంతానికి చెందిన ఈయన ఎంతో శ్రమకోర్చి నటుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశానికి చేసిన సేవలు అనిర్వచనీయం.
ఇప్పటికీ అతని కుమారులు, మనవలు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానాలలో రాణించడం విశేషం.ఈ నేపథ్యంలో అన్నగారి కుటుంబంపై ఒక చిన్న అపవాదు కూడా ఉంది.
ఈ కుటుంబం నుంచి పురుషులు మాత్రమే సినిమా రంగంలోకి రావడం ఏంటి? మహిళలకు ఆ అవకాశాలు ఇవ్వరా? అనేది ఓ విమర్శ.
ఇకపోతే సహజంగానే అప్పట్లో సినీ ప్రముఖులు ఎవరూ కూడా తమ పిల్లలను ఈ రంగంలోకి తీసుకువచ్చేవారు కాదు.
ఈ ఫీల్డ్లో వ్యసనాలు ఎక్కువని, వస్తే పాడైపోతారని ఓ అపవాదు వుంది.అందుకే దూరం పెడుతున్నామని.బహిరంగంగానే చెప్పేసేవారు.కానీ, అన్నగారు మాత్రం తన 4 కుమారులను కూడా ఈ ఫీల్డ్లోకి తీసుకువచ్చారు.
నందమూరి రామకృష్ణ ఎడిటింగ్, సమర్పకులుగా ఉంటే.హరికృష్ణ, బాలకృష్ణల గురించి అందరికీ తెలిసిందే.
ఇక, నందమూరి మోహన్ కృష్ణ కొన్నాళ్లు.నిర్మాణ బాధ్యతలు చూశారు.
ఇక ఆయన మరో కుమారుడు జయకృష్ణ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు.
ఇక ఎవరికీ అంతగా తెలియని విషయం ఏమంటే, అన్నగారి కుటుంబం నుంచి ఓ మహిళ ఓ సినిమాలో మెరిసింది.కానీ ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు.ఆమె మరెవరో కాదు… ప్రస్తుతం బీజేపీ నాయకురాలిగా ఉన్న.
దగ్గుబాటి పురందేశ్వరి.అవును, శ్రీకృష్ణావతారం సినిమాలో బుల్లి కృష్ణుడి వేషం వేశారు.
తర్వాత కాలంలో మాత్రం ఆమె సినిమాల్లో కనిపించలేదు.దీనికి కారణం.
అన్నగారు ఆమెను ప్రోత్సహించాలని అనుకున్నా, ఆయన సతీమణి బసవతారకం వారి చదువులు ఎక్కడ దూరం అవుతుందోననే భయంతో పిల్లలను సినిమాల్లోకి రానివ్వలేదట.