గత ఏడాది ఎంతమంది భారత పౌరసత్వం వద్దనుకున్నారో తెలుసా...!!

పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి ఉన్నత విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎన్నో కారణాలతో విదేశాలకు వెళ్ళిపోతున్న వారి సంఖ్య ప్రతీ ఏటా లక్షల్లోనే ఉంటోంది.అంతేకాదు వలసలు వెళ్ళిన వారు అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ఇక భారత్ లో ఉండకూడని నేపధ్యంలో శాశ్వతంగా భారత్ ను ఎంతో మంది భారతీయులు వీడిపోతున్నారు.

 In 2021, Over 1.6 Lakh Indians Renounced Citizenship,indians,america,australia,i-TeluguStop.com

ఒకరు కాదు రెండు కాదు ఏకంగా లక్షలాది మంది శాశ్వతంగా భారత్ ను వీడిపోతున్నారని కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రకటించింది.


గడిచిన ఏడాది సుమారు 1.63 లక్షల మంది భారతీయులు భారత పౌరసత్వాన్ని వాడులుకున్నారట.ఈ విషయాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.2021 ఏడాదికి గాను 1.63 లక్షలు ఉండగా 2019 ఏడాదికి గాను వీరి సంఖ్య 1.44 లక్షలు ఉందని తెలిపింది.ఈ గణాంకాల ప్రకారం ప్రతీ ఏడాదికి భారత్ ను వీడిపోతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా రెట్టింపవుతోంది.కాగా భారత్ ను వీడుతున్న వారిలో అత్యధికంగా అమెరికాకు వలస వెళ్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి.

2020 లో భారత్ నుంచీ అమెరికా వెళ్ళిన వారి సంఖ్య 30 వేలుగా ఉండగా 2021 ఏడాదికి గాను ఇది రెండింతలు అయ్యింది అంటే సుమారు 78 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు.ఇక అమెరికా తరువాత భారతీయులు ఎక్కువగా స్థిరపడుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే. 2020 లో సుమారు 13 వేల మంది ఆస్ట్రేలియా వెళ్ళగా 2021 లో దాదాపు 24 వేల మంది ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని తీసుకున్నారు.

అయితే తాజాగా కెనడా వైపు భారతీయులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారట.భవిష్యత్తులో అమెరికా కంటే కూడా కెనడా కే భారతీయులు వలసలు వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube