టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఫాలో ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే.
అటు రాజకీయాలు అయినా ఇటు సినిమాలు అయినా పవన్ కళ్యాణ్ రూటే వేరు అని చెప్పవచ్చు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పాలిటిక్స్ లో కూడా బిజీ బిజీగా ఉంటున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా పెట్టుకుని దూసుకుపోతున్నారు.కాగా జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే.
అటు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీ పై సెటైర్లు వేస్తూ ఉంటారు.మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.
మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు జీవితాలను నాశనం చేశాడు అంటూ ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు ఆయన పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.పవన్ బద్రీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ను ప్రేమించి కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి ఆతర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే పవన్, రేణు దేశాయ్కు అకీరా నందన్, ఆద్యా జన్మించారు.
కాగా రేణు దేశాల నుంచి విడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన పిల్లల బాధ్యతను తీసుకున్నాడు.

అంతేకాకుండా పండుగల సమయంలో అకీరా నందన్ మెగా ఫ్యామిలీ లో కూడా మెరుస్తూ ఉంటాడు.ఇటీవలే అఖిరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ వేడుకకు హాజరైన విషయం తెలిసిందే.ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అకీరా నందన్ ఇటీవల గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసుకున్నాడు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కీ ఆయన తనయుడు అకీరా నందన్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు.అకీరాతో తనకు సబంధం లేదని పవన్ కళ్యాన్ చెప్పారన్నారు.యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ.నేను అబద్ధాలు చెప్పడం లేదు.కావాలి అంటే 2007 సెప్టెంబర్ 5వ తేదీ OP 590/ 2007 పిటీషన్ నంబర్ను కూడా చూడండి అని తెలిపాడు.నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.







