ప్రముఖ టాలీవుడ్ నటిమణులలో ఒకరైన నీతూ చంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు.ప్రముఖ వ్యాపారవేత్త జీతం తీసుకుని భార్యగా ఉండాలని తనకు ఆఫర్ ఇచ్చాడని ఆమె చెప్పుకొచ్చారు.
అలా చేయడానికి అంగీకరిస్తే పాతిక లక్షల రూపాయలు ఇస్తానని ఆయన నాతో చెప్పాడని నీతూచంద్ర కామెంట్లు చేశారు.నా కథ సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ కథ అని ఆమె అన్నారు.
పలు పెద్ద సినిమాలలో తాను నటించానని 13 మంది జాతీయ అవార్డు గ్రహీతలకు తాను జోడీగా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.అయితే ప్రస్తుతం నాకు వర్క్ లేదని ఆమె కామెంట్లు చేశారు.
ప్రముఖ వ్యాపారవేత్త నాకు నెలకు పాతిక లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.ఆ వ్యాపారవేత్త జీతం తీసుకుని వైఫ్ గా ఉండాలని తనను కోరాడని ఆమె కామెంట్లు చేశారు.
ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదని పని లేదని ఆమె చెప్పుకొచ్చారు.

చాలా మంచి సినిమాలలో నటించిన తర్వాత కూడా ఇక్కడ అనవసరంగా ఉన్నానని నాకు అనిపిస్తోందని ఆమె తెలిపారు.గరం మసాలా అనే మూవీతో నటిగా నీతూ చంద్ర కెరీర్ మొదలైంది.ఆ తర్వాత నీతూ చంద్ర పలు చిన్న సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
పలు ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నీతూ చంద్ర నటించడం గమనార్హం.ఆఫర్ ఇచ్చిన వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.పలు జాతీయ అవార్డులను అందుకున్న నీతూ చంద్రకు అవకాశాలు రాకపోవడం ఆమె ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.నీతూ చంద్రకు స్టార్ డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వాలని టాలెంట్ ఉన్న నటీమణులను ప్రోత్సహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.








