మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.
ఇకపోతే కలెక్షన్ల పరంగా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా చూస్తున్న నేటిజన్లు అభిమానులు ఈ సినిమాలో తప్పులను వెతకడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే కొన్ని తప్పులను గుర్తించి దారుణంగా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా బయటపడుతున్నాయి.
ఇంతకీ ఈ సినిమాలో డైరెక్టర్ చేసిన తప్పు ఏంటి అనే విషయానికి వస్తే.ఈ సినిమా సెకండ్ హాఫ్ ఢిల్లీలో ఓ సన్నివేశం జరుగుతుంది.
నదియా పాత్ర జైల్లో ఉన్నప్పుడు ఆమెను కలుసుకోవడానికి వెళ్లిన మహేష్ బాబు అక్కడికి విలన్ సముద్రఖనిని కూడా రమ్మని చెబుతారు.తాను వచ్చేటప్పుడు కొన్ని పళ్ళు తీసుకురమ్మని చెబుతారు.

ఇక మహేష్ బాబు అడిగిన పళ్ళు తీసుకొచ్చిన తర్వాత అవి నదియాకు తీసుకోమని చెప్పగా ఆమె వాటిని తీసుకోకుండా వెళ్ళిపోతుంది.అయితే ఈ సన్నివేశాన్ని థియేటర్లో చూసినప్పుడు ఆమె ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యి పళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోతుందని భావిస్తారు.ఓటీటీలో చూసాక నిజంగా ఆమె ఆ పళ్ళు తీసుకోవాలనుకున్నా అక్కడ స్పేస్ ఉండదు.దీంతో నెటిజన్లు ఈ తప్పును ఎత్తి చూపుతూ దారుణంగా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కానున్నారు.







