సాయి పల్లవి పేరు చెబితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి.ఈమెకు యూత్ లో భారీ క్రేజ్ ఉంది.
ఎక్కువ అందాల ఆరబోత చేయకపోయినా ఈమె అంటే అందరు ఇష్ట పడుతున్నారు.ఇక ఈమె డ్యాన్స్ కోసం అయితే ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక ఈమెను ఏకంగా లేడీ పవర్ స్టార్ అని స్టార్ డైరెక్టర్ సైతం అన్న సందర్భం ఉంది.
సాయి పల్లవి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం విధితమే.
మొదటి సినిమాతోనే ఈమె అందరి మనసులను ఫిదా చేసింది.ఈ సినిమా అప్పట్లోనే 50 కోట్ల బిజినెస్ చేసి మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది.
ఈ సినిమాలో ఈమె పాత్ర హైలెట్ గా నిలవడంతో సాయి పల్లవికి ఎక్కువ పేరు వచ్చింది.అయితే ఈమె ఇప్పుడు మాత్రం వరుస ప్లాప్స్ అందుకుంటూ రేస్ లో వెనుకబడి పోయింది.
కనీసం సాయి పల్లవి సినిమా వస్తుంది అంటే ఎలాంటి హడావిడి లేకుండా పోయింది.ఈ మధ్యనే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ఈ అమ్మడి నటనకు అంతా ఫిదా అయ్యారనే చెప్పాలి.అయితే ఈమెకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా ఆకట్టు కోలేక పోతుంది.
ఈమె డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఈమె సినిమాలను పట్టించు కోవడం లేదు.ప్రెసెంట్ సాయి పల్లవి గార్గి సినిమా చేస్తుంది.తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

ఈ సినిమా జులై 15న రిలీజ్ కాబోతుంది.అయినా కూడా ఈమె సినిమాపై ఎలాంటి బజ్ లేదు.ఈ సినిమా వస్తుంది అని చాలా మందికి తెలియను కూడా తెలియదు.
ఈ సినిమాను గౌతమ్ రామచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నారు.బ్లాకీ జనీ బ్యానర్ పై రవి చంద్రన్ ఐశ్వర్య లక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరి 50 కోట్ల హీరోయిన్ ను ఏమాత్రం పట్టించు కోవడంలేదు.చూడాలి ఈ సినిమా ఈమెకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.







