ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తొలి రెండు సంవత్సరాలలో.బెస్ట్ సీఎంగా చాలా సందర్భాలలో నిలిచారు.
కానీ మూడో సంవత్సరం నుండి ఆయన గ్రాఫ్ తగ్గుతున్నట్లు తాజా పరిణామాలు బట్టి టాక్ వస్తుంది.విషయంలోకి వెళ్తే ఇటీవల సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వేలో అత్యంత జనాధారణ కలిగిన ముఖ్యమంత్రుల ర్యాంకింగ్ లో సీఎం జగన్ కి 20వ స్థానం దక్కింది.
అంతకుముందు తొలి 5 స్థానాలలో ఉండే జగన్ ఇప్పుడు ఏకంగా 20వ స్థానంలోకి వెళ్లిపోవడంతో.జనాలలో ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఇదే సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదవ స్థానంలో నిలిచారు.మొదటి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండగా మూడవ స్థానంలో.
ఇటీవల మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు.







