కరోనా చేయబట్టి థియేటర్ లకు ప్రేక్షకులు రావడం అనేది చాలావరకు తగ్గింది.అంతకుముందు శుక్రవారం సినిమా రిలీజ్ అంటే అది ఎవరి సినిమా అయినా సరే ఆడియెన్స్ వచ్చేవారు.
కానీ ఇప్పుడు అది స్టార్ సినిమాలకు మాత్రమే సాధ్యమవుతుంది.మాములు సినిమాలు క్రౌడ్ ఫిల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు.
సినిమాకు మంచి టాక్ వచ్చినా సరే ఆడియెన్స్ దృష్టిని ఆకట్టుకోలేకపోతున్నాయి.అందుకే ఈమధ్య రిలీజైన సినిమాలకు థియేటర్ లో ఆడియెన్స్ లేక వెలవెలబోతున్నాయి.
ఈ క్రమంలో నెక్స్ట్ వస్తున్న సినిమా రామ్ ది వారియర్ మీద అందరు ఆశలు పెట్టుకున్నారు.రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.
మాస్ ఆడియెన్స్ కి ఇది ఓ మంచి ఫీస్ట్ ఇచ్చే సినిమాగా వస్తుంది.ఓ సినిమా హిట్ చేయాలన్నా ఫట్ చేయాలన్నా మాస్ ఆడియెన్స్ చేతుల్లోనే ఉంటుంది.
ది వారియర్ పక్కా మాస్ మూవీగా వస్తుంది.మరి వారి చేత వారియర్ సూపర్ అనిపించుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
అంతేకాదు రామ్ సినిమాకైనా ఆడియెన్స్ థియేటర్ లకు వస్తారా లేరా అని టెన్షన్ పడుతున్నారు.

2 టైర్ హీరో అయిన రామ్ తన సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల హిట్ తో సూపర్ ఫాం లో ఉన్న రామ్ లింగుసామితో ది వారియర్ అంటూ బై లింగ్వల్ సినిమాతో వస్తున్నాడు.ఈ సినిమా లో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటించారు.జూలై 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై రామ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
తెలుగులోనే కాదు ఈ సినిమా తమిళంలో కూడా భారీ బజ్ ఏర్పరచుకుంది.







