ఆనాడు ముద్దులు నేడు పిడుగుద్దులు మదనపల్లి మినీ మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ ప్రతిపక్ష నేత టిడిపి అధినేత చంద్రబాబు నేటి నుండి మూడు రోజులపాటు రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలలో చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉంది.

 Madanapalli Mini Mahanadu Chandrababu Serious Comments Details,  Chandrababu, Td-TeluguStop.com

దీనిలో భాగంగా మదనపల్లిలో మినీ మహానాడు నిర్వహించగా అక్కడ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుండి అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఆనాడు అధికారం కోసం ఊరురా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్… నేడు అధికారంలోకి వచ్చాక పిడుగుద్దులు గుద్దుతున్నారని వ్యంగ్యంగా విమర్శ చేశారు.

అమ్మబడి ఒక బూటకం ఆంగ్ల మధ్యమం ఒక నాటకం.అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.మదనపల్లిలో జరిగిన మినీ మహానాడుకు.టిడిపి కార్యకర్తలు నాయకులు భారీగా హాజరయ్యారు.

ఈ సభకు హాజరవ్వడానికి హైదరాబాదు నుండి బెంగళూరు చేరుకున్న చంద్రబాబుకు. భారీ ఎత్తున టిడిపి శ్రేణులు స్వాగతం పలికాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube