సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజక వర్గం: హుజూర్ నగర్ అమరారం గ్రామస్థులతో వైఎస్ షర్మిల కామెంట్స్.అమరారం గ్రామానికి మంచినీళ్లు లేవు కానీ గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది.
మంచినీళ్లు తెచ్చుకోవాలి అంటే కిలోమీటర్ పోవలట.బంగారు తెలంగాణ అని చెప్పి పోలీస్ ల దౌర్జన్యం…టీఆరెఎస్ లూటీలు.
దొంగల రాజ్యం చేశారు.
ఇక్కడ ఎమ్మెల్యే సైదిరెడ్డి పెద్ద దొంగ.
ప్రశ్నిస్తే మా మీద దాడులు చేయించారు.పోలీస్ లను పనోళ్ళలా వాడుకున్నారు.
మూడు గంటలు వర్షం లో కూర్చుని న్యాయం కోసం ధర్నా చేస్తే కానీ సర్కార్ లొంగ లేదు.కేసీఅర్ పాలన అధ్వాన్నంగా ఉంది అంటే ఇందులో కాంగ్రెస్ కు బీజేపీ కి సైతం భాధ్యత ఉంది.
బహిరంగంగా ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతుంటే ప్రతి పక్షాలు ఏంచేస్తున్నాయి.అక్రమంగా ఎంతో మంది పై కేసులు పెడుతున్నారు.పోలీస్ లు టీఆరెఎస్ చొక్కాలు వేసుకోండి.పోలీస్ లు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కాదు.
మమ్మలని పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు.ఎలా చెయ్యనియ్యరో చూద్దాం అని పాదయాత్ర చేస్తున్న.