తిరుపతి: సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లు తిరుపతి కోర్టుకు హాజరు.టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసారు.
అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్ పై కేసులు నమోదు చేసినా పోలీసులు.
రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తు పోలీస్ అనుమతి లేదని, 341, 171(ఎఫ్), పోలీస్ యాక్ట్ 290 కింద వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదైంది.
ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు
మోహన్ బాబు, విష్ణు, మనోజ్
పాదయాత్రగా అభిమానులతో కోర్టుకు హాజరయ్యారు.కోర్టు ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసింది.మోహన్ బాబుకు సంఘీబావంగా బిజెపి నేత కోలా ఆనంద్, వైసిపి నేతలు అన్నా రామచంద్ర, ఎంవియస మణిలు కోర్టు వద్దకు.సెప్టెంబరు 20తేదికి కేసును వాయిదా వేసినా నాల్గవ అదనపు కోర్టు.







