నల్గొండ జిల్లా:దామరచర్ల మండల కేంద్రంలో వార్త విలేకరి రామ్ ప్రసాద్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది.గత మూడు రోజుల క్రితం ఇంటి వద్ద నుంచి పోలీసులమని చెప్పి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలిస్తూ, పోలీసులు నల్లగొండ డిటీసీకి తీసుకెళ్లి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దేనికొరకు వార్త రిపోర్టర్ ని కిడ్నాప్ చేశారు?అసలు ఎవరు చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది.