తిరుమలలో మద్యపాన నిషేధం అమలులో ఉందని తిరుమల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ తిరుమలయ్య అన్నారు.తిరుమలలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు.జీఎన్సి టోల్ గెట్ వద్ద తెల్ల స్విఫ్ట్ కారులో మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.వాహనంలో 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సైతం సీజ్ చేసామన్నారు.అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి, తిరుమలకి చెందిన పిఎన్ రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
స్థానిక బాలాజీనగర్ లో ఉంటూ మద్యం బాటిల్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు.తిరుమలలో మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధించడం జరిగిందని, మత్తు పదార్థాలు సేవించిన.
,విక్రయించిన కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.







