స్టార్ హీరోయిన్ అనుష్కకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు.తన సినీ కెరీర్ లో అనుష్క ఎక్కువగా అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అనుష్క ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం అనుష్క పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.
కెరీర్ విషయంలో అనుష్క ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఒక ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ సైజ్ జీరో సినిమా కోసం తాను 17 కేజీలు పెరిగానని ఆమె తెలిపారు.
అమ్మాయిలు పెళ్లి అయ్యేవరకు బరువును అదుపులో ఉంచుకోవాలని ఆమె అన్నారు.ప్రతి ఒక్క పేరెంట్ కు పిల్లల మ్యారేజ్ డ్రీమ్ అని అనుష్క కామెంట్లు చేశారు.తల్లీదండ్రులకు పిల్లలకు మ్యారేజ్ చేయాలని ఉంటుందని ఆమె తెలిపారు.అరుంధతి చేసే సమయంలో గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియదని అనుష్క వెల్లడించారు.
ఆ సమయంలో నాకు సినిమాలలో చాలా విషయాలకు సంబంధించి నాలెడ్జ్ జీరో అని అనుష్క అన్నారు.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణలకు తనను అంత బాగా చూపించడం దక్కుతుందని ఆమె తెలిపారు.రుద్రమదేవి సినిమా చేస్తున్న సమయంలో కొంత అవగాహన ఉందని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఎక్కడికి వెళ్లినా జేజమ్మ అని బుగ్గలు పెట్టుకుంటారని అనుష్క కామెంట్లు చేశారు.

అరుంధతి సమయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఫైనాన్షియల్ స్టేజ్ బాలేదని ఆమె అన్నారు.శ్యామ్ ప్రసాద్ రెడ్డిని తాను కింగ్ కాంగ్ అని పిలుస్తానని ఆమె తెలిపారు.శ్యామ్ ప్రసాద్ రెడ్డి లొకేషన్ లో చాలామందిని తిట్టేవారని ఆయన వేరేవాళ్లను బూతులు తిడుతూ ఉండేవారని ఆ పదాలకు నాకు అర్థం తెలిసేది కాదని ఆమె అన్నారు.వాటికి మీనింగ్ అడిగితే అడగొద్దమ్మా అని ఆయన చెప్పేవారని అనుష్క పేర్కొన్నారు.







