మతపరమైన ఉద్రిక్తతలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టుడికి పోతోంది.పైగా అక్కడ హిందూ మతాన్ని అధికంగా ప్రోత్సహించే వ్యక్తి అయినా యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు.
ముస్లిములపై తరచూ దాడులు జరుగుతుండడం, వారినే టార్గెట్ చేసుకుని అధికార బలంతో అణచి వేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఇటువంటి తరుణంలో ఓ ముస్లిం యువకుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు వీరాభిమానిగా మారాడు.
ఏకంగా తన ఛాతీపై ఆదిత్యనాథ్ చిత్రం పచ్చబొట్టు వేసుకున్నాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
యమీన్ సిద్ధిఖీ అనే 23 ఏళ్ల ముస్లిం యువకుడు తన ఛాతీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాన్ని టాటూగా వేయించుకున్నాడు.యోగి తన రోల్ మోడల్ అని, ఈ నెల ప్రారంభంలో యోగి పుట్టినరోజు సందర్భంగా టాటూ వేయించుకోవడం ద్వారా ఆయనకు ఇదే తన బహుమతి అని చెప్పాడు.
యూపీలోని ఫరూఖాబాద్, మెయిన్పురి జిల్లాల సరిహద్దులో ఉన్న ఒక గ్రామంలో సిద్దిఖీ నివసిస్తున్నాడు.అతడు స్థానికంగా పాదరక్షల వ్యాపారం చేస్తున్నాడు.అతను టాటూ వేయించుకున్నప్పటి నుండి తన స్నేహితులు, బంధువుల నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు అతను అంగీకరించాడు.అయినప్పటికీ ఈ విషయంలో అతడు ఏ మాత్రం బాధ పడడం లేదు.
పైగా సీఎం యోగి ఆదిత్యనాథ్ని కలుసుకుని తన ఛాతీపై వేయించుకున్న టాటూ చూపించాలన్నది తన కోరిక అని చెప్పాడు.
ఆయనంటే తనకు అమితమైన ప్రేమ, గౌరవం అని పేర్కొన్నాడు.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ను చాలా అద్భుతంగా యోగి మార్చేశారని ఆయన చెబుతున్నాడు.ఎలాంటి వివక్ష లేకుండా, హిందువులు-ముస్లింలు అనే బేధం లేకుండా అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలు పొందుతున్నారని ప్రశంసించాడు.
ఇక జ్ఞాన్వాపి మసీదు, మథుర ఈద్గా వంటి వివాదాస్పద అంశాల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.అది కోర్టు నిర్ణయిస్తుందని మీడియా వద్ద పేర్కొన్నాడు.