అడవికి రాజు సింహం ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడదు.అయితే ఒక్కోసారి ప్రాణహాని ఉందంటే అవి కూడా ప్రాణభయంతో పరిగెత్తుతాయి.
కానీ ఇటీవల ఒక సింహానికి పరిగెత్తడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.ఎందుకంటే అది ఒక నీటి కొలనులో 40 మొసళ్ల మధ్య చిక్కుకుపోయింది.
నీటిలో ఇది చనిపోయిన ఒక హిప్పో కళేబరంపై నిల్చొని ఉంది.దీన్ని చూసిన మొసళ్ళ అన్నీ కలిసి దాని మీద ఎటాక్ చేయడానికి దూసుకొచ్చాయి.
దీంతో బాగా భయపడిపోయిన సింహం ఏం చేయాలో అర్థం కాక కాసేపు అలాగే ఉండిపోయింది.ఆ తర్వాత ధైర్యం చేసి ముందుకు దూకింది.
తర్వాత ఏమైందో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరు చూడొచ్చు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక సింహం హిప్పో కళేబరంపై నిల్చొని ఉండటం గమనించవచ్చు.
ఆ తర్వాత నాలుగైదు మొసళ్లు ఒక్కసారిగా సింహంపై దాడి చేసేందుకు ఆ కళేబరం పైకి ఎక్కడానికి ప్రయత్నించడం చూడొచ్చు.దాంతో హడలిపోయిన ఆ సింహం నీటిలోకి దూకి శరవేగంగా ఒడ్డు మీదకి చేరుకుంది.
దీంతో ప్రాణాపాయం తప్పినట్లు అయింది.
మే 23న కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్లో ఆంటోనీ పెసి ఈ వీడియోను చిత్రీకరించారు.
అనంతరం ఈ వీడియోని యూట్యూబ్ లో షేర్ చేయగా.దీనికి ఇప్పటికే 12 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
దీనిపై నెటిజన్లు “ఓరి నాయనో ఇలాంటి సిచువేషన్ లో ఉంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే” అని కామెంట్లు పెడుతున్నారు.ఈ సింహం మాములు లక్కీ కాదని మరొకరు కామెంట్ పెట్టారు.
ఈ షాకింగ్ వీడియో ని మీరు కూడా వీక్షించండి.







