బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఈయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు.అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.
సాహో ఇటీవలే రిలీజ్ అయినా రాధేశ్యామ్ కూడా హిట్ కొట్టలేక పోయింది.ఇలా ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ రాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ బరువు తగ్గబోతున్నాడు అని టాక్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యి షూటింగ్ జరుపుకుంది.అయితే ఇప్పుడు ఈ సినిమాలో అప్పటి ప్రభాస్ లుక్ కోసం కొద్దిగా బరువు తగ్గాలట.దీంతో ప్రభాస్ మరోసారి లీనియర్ గా మారి స్టన్నింగ్ లుక్ లో కనిపించ బోతున్నాడు.
ఈ వార్త విన్న డార్లింగ్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించ నున్నాడు.ఈ పాత్ర కోసం డార్లింగ్ వి షేప్ బాడీ కోసం చాలా చెమటలు చిందించాడు.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా జానకి పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.
లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.
అలాగే ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే కూడా షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.