వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో ప్రదర్శించబడుతోంది.అనిల్ రావిపూడి ఈ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.ఎఫ్3 ప్రదీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నా లైఫ్ లో నేను థ్రిల్ అయిన మూమెంట్ ఏంటంటే ఒక హోటల్ కు వెళ్లిన సమయంలో మొదట హోటల్ క్లోజ్ అయిందని చెప్పి ఆ తర్వాత వెళ్లి కూర్చోండని చెప్పారని ఆయన అన్నారు.
ఆ తర్వాత మీకు ఏం కావాలంటే అది చేసిపెడతాం అని చెప్పారని ఆ తర్వాత ఆ వ్యక్తి మీ వల్లే ఈ హోటల్ పెట్టుకున్నానని మీరు ఇన్స్పైర్ చేసిన మాటల ద్వారా తాను మారానని అతను చెప్పడంతో ఆశ్చర్యపోయానని ఎఫ్3 ప్రదీప్ కామెంట్లు చేశారు.అతను ఆ విధంగా చెబితే నా కళ్లలో నీళ్లు వచ్చాయని ఎఫ్3 ప్రదీప్ వెల్లడించారు.15,000 మంది టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో ఉంటే ఫస్ట్ ప్రొఫెసనల్ నేనని ఆయన అన్నారు.
తాను ఏరోజు ఎవరినీ ఛాన్స్ అడగలేదని గత 42 సంవత్సరాల నుంచి తాను బిజీగానే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.
నేను ఇంకా ఫీల్డ్ లో ఉన్నానని ఎంతోమంది కెరీర్ ఆగిపోయినా నటుడిగా తాను కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.అమ్మ చనిపోయిన సమయంలో కూడా తాను సీరియల్ లో నటించాల్సి వచ్చిందని అయన అన్నారు.తాను అస్థికలు కలపడానికి కృష్ణానదికి వెళితే అందరూ చుట్టూ చేరి నన్ను చూసి నవ్వుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
మమతల కోవెల సీరియల్ లో పాత్ర వల్ల తనను గుర్తుపట్టి ఆ పాత్ర పేరుతో పిలిచారని అయితే తాను ఎందుకు వచ్చానో మరిచిపోయి ప్రవర్తించడం డిస్టర్బ్ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.తిరుపతి వెంకట కవుల గురించి టెలివిజన్ లో చేయాలని తన కోరిక అని ఆయన కామెంట్లు చేశారు.ఈ వేషం చేయాలని కోరిక అని ఆయన కామెంట్లు చేశారు.
సినిమాలలో ఏ పాత్ర అయినా చేయగలనని ఆయన అన్నారు.