జాక్ఫ్రూట్ (పనస) ప్రపంచంలోని అతిపెద్ద పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.దీనిలోని ఐసోఫ్లేవోన్స్ వంటి పోషకాలు, సాపోనిన్ల లాంటి ఫైటోన్యూట్రియెంట్ల కారణంగా ఈ పండ్లు క్యాన్సర్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పోరాడుతాయి.
సాధారణంగా జాక్ఫ్రూట్ను పండ్లుగా, కూరగాయలు, పచ్చళ్లు మొదలైన వాటి తయారీకి ఉపయోగిస్తారు.మార్కెట్లో పనసపండు ధరలు కూడా బాగానే ఉన్నాయి.
జాక్ఫ్రూట్ సాగుకు రైతులు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు.ప్రత్యేక పర్యవేక్షణ లేకుండా కూడా దీన్ని పెంచవచ్చు.
ఈ పండ్లు దాదాపు 8-10 నెలల్లో బండింగ్/గ్రాఫ్టింగ్కు సిద్ధంగా ఉంటాయి.
ఒకసారి పంట వేస్తే రైతులు చాలా ఏళ్లపాటు లాభాలు పొందవచ్చు.
పొడి వాతావరణం జాక్ఫ్రూట్ సాగుకు అనుకూలమైనదిగా పరిగణిస్తారు.దీన్ని ఎక్కడైనా పెంచుకోవచ్చు.
ఈ పండును కొండలు, పీఠభూములు వంటి ప్రదేశాలలో కూడా పండించవచ్చు.తేలికపాటి సంరక్షణతో ఈ చెట్టు కొద్దికాలంలోనే రైతులను ధనవంతులను చేస్తుంది.
జాక్ఫ్రూట్ సాగుకు నీటిపారుదల అవసరం.మొక్క నాటినది మొదలు నీరు పెట్టడం ఎంతో అవసరం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మొక్కకు వేసవి, చలికాలంలో ప్రతి 15 రోజుల వ్యవధిలో నీరు పెట్టాల్సివుంటుంది.