టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.నిన్న బర్త్ డే జరుపుకున్న నేపథ్యంలో NTR30 నుండి బిగ్ అప్డేట్ వదిలాడు కొరటాల.
ఈ అప్డేట్ తో ఇప్పటి వరకు ఉన్న అన్ని అనుమానాలు పోయాయి.
ఆచార్య ప్లాప్ తో కొరటాల సినిమా హోల్డ్ లో పెడతాడేమో అని అంతా అనుకున్నారు.
కానీ కొరటాల మీద నమ్మకం ఉంచి ఈ సినిమాను ముందుకు తీసుకు వస్తున్నాడు.నిన్న వదిలిన పోస్టర్ తో ఫ్యాన్స్ కు ఉన్న అనుమానులు కూడా పోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ డైలాగ్ కూడా చెప్పి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేసాడు.
ఈ మోషన్ పోస్టర్ ను చుసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆచార్య సినిమా ప్లాప్ ను మర్చిపోయి మరీ ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆలోచించడం స్టార్ట్ చేసారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించిన చర్చ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి జరుగుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న నేపథ్యంలో హీరోయిన్ ను కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ లుగా కైరా అద్వానీ, జాన్వీ కపూర్ ల పేర్లు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా మరొక బ్యూటీ పేరు కూడా వినిపిస్తుంది లోఫర్ బ్యూటీ దిశా పటానీ ని కొరటాల ఎంపిక చేసినట్టు టాక్ బయటకు వచ్చింది.ఈ వార్త నిజమే అయితే ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరిగినట్టే.ఈమె గ్లామర్ విందు చేయడంలో అస్సలు మొహమాట పడదు.ఇప్పటికే ఈమె ప్రాజెక్ట్ కే లో కీలక పాత్ర నటిస్తుంది.ఇది కూడా ఓకే అయితే మరికొన్ని ప్రాజెక్ట్స్ వరించే అవకాశం ఉంది.