చెట్ల పెంపకంతో రైతులు లాభాల బాట పడతారనడంలో సందేహం లేదని నిపుణులు చెబుతుంటారు.అందుకే ఇప్పుడు అటువంటి చెట్ల పెంపకం గురించి తెలుసుకుందాం.
మీరు నీలగిరి చెట్టును సాగు చేస్తే భారీ లాభాలను కళ్లజూస్తారు.దీనిని సాగు చేయడంలో ఇబ్బందులుండవు.
దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు.వాతావరణంలో మారుతున్న తీరుతెన్నులు ఈ చెట్టుపై అధిక ప్రభావం చూపవు.
దీని సాగు ఖర్చు చాలా తక్కువ.అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.ఈ చెట్టు తక్కువ దట్టంగా.నిటారుగా ఎదుగుతుంది.కాబట్టి దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు.
మూడు వేల మొక్కలను ఒక హెక్టారు విస్తీర్ణంలో నాటవచ్చు.
ఈ చెట్టు పరిపక్వం చెందడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పడుతుంది. గుమ్మడి టేకు చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి.
దీని ఆకులను మందుల తయారీలో ఉపయోగిస్తారు.అల్సర్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చెట్టు చెక్కలు ఎంతగానో సహకరిస్తాయి.
మార్కెట్లో టేకు కలప అత్యంత ఖరీదైనది.దృఢమైన బలమైన చెక్కలకు ఇది ఎంతో పేరొందింది.
ఒక ఎకరం పొలంలో దాదాపు 500 టేకు చెట్లను నాటవచ్చు.అయితే అక్కడి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండాలి.
చాలా వరకు టేకును మంచు ప్రాంతాలు లేదా ఎడారి ప్రాంతాల్లో సాగు చేయరు.దీనికి ఒండ్రు మట్టిని ఉత్తమంగా పరిగణిస్తారు.







