సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత చాలా రోజుల పాటు సైలెంట్ అయ్యింది.ఆ సమయంలోనే ఈమెకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది.
స్వయంగా అల్లు అర్జున్ నే ఈమెను ఈ సాంగ్ కోసం ఒప్పించారు.ఆ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో ఈమె బాలీవుడ్ లో సైతం ఫేమస్ అయ్యింది.
ఈమె ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.సామ్ స్పీడ్ చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు వరుస వెకేషన్స్ కు వెళ్తూ క్షణం కూడా కాళీ లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది.
తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన అవకాశం అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ లో సమంత బిజీగా ఉంది.ఇక ఈమె శాకుంతలం సినిమాతో పాటు యశోద సినిమాలు షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచింది.
అయితే ఈమెకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఈమె ఎందుకు ఓకే చెప్పడం లేదని అందరు ఆలోచిస్తున్నారు.
అయితే ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయట.ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ తెలుగు సినిమాలపైనే ఎందుకు ద్రుష్టి పెట్టింది అనే విషయంపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.ఏంటంటే.
ఈమెకు బాలీవుడ్ నుండి అన్ని కూడా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే అవకాశాలు వచ్చాయట.అందుకే ఈమె సున్నితంగా నో చెప్పిందట.
మన సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చేసిన సామ్ అక్కడ సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు రావడంపై అవమానంగా కూడా ఫీల్ అయ్యిందట.అందుకే అక్కడ సామ్ సినిమాలను చేయడం లేదు అని తాజా సమాచారం.