సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చుసిన సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ లలోకి వచ్చి తొలిరోజే మిశ్రమ స్పందన అందుకుంది.
ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.ఈ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా కర్నూల్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో టీమ్ మొత్తం పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఈ వేదికపై డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ.కర్నూల్ కి నాకు అవినాభావ సంబంధం ఉంది అని.ఒక్కడు సినిమా చుసిన తర్వాతనే నేను డైరెక్టర్ అవ్వాలని అనుకుని ఇండస్ట్రీకి వచ్చాను.నేను ఎంతగానో ప్రేమించే సూపర్ స్టార్ తో సినిమా చేయడం.
ఇక్కడికి రావడం.ఈ ఫంక్షన్ కు హాజరవ్వడం నాకు లైఫ్ టైం గిఫ్ట్ ఇది.

ఈ సందర్భంగా నేను మహేష్ బాబు గారికి థాంక్స్ చెబుతున్నారు.ఈ సినిమాలో ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ ఆయన మీద నాకున్న ప్రేమనే.నా శక్తి మేరకు నేను ఆయనకు అద్భుతమైన హిట్ ఇస్తానని చెప్పను.ఆ మాట నిలబెట్టుకున్నాను అనే అనుకుంటున్నాను.ఈ సినిమా కోసం కష్టపడినా ప్రతి ఒక్కరికి థాంక్స్.ఇంతగా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణమైనాకు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను.
అంటూ పరశురామ్ ఎమోషనల్ వర్డ్స్ చెప్పుకొచ్చాడు.







