ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలిసులు తమ పై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి, ఉన్నత అధికారులకు ఓ దంపతులు ట్విట్టర్ ద్వారా పిర్యాదు చేసారు.
దంపతులు చెబుతున్న వివరాలు ప్రకారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు అతని భార్య భవానీ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
తమ కుటుంబ సభ్యులను చూసేందుకు భార్యభర్తలతో పాటు భవానీ సోదరుడు వెంకటేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామం కమలాపురం వస్తున్నారు.నేలకొండపల్లి చేరుకునే సరికి నిన్న సుమారు రాత్రి 12.20 అయింది.ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని ఆపి సంబంధం లేని ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేశారు.
ఈ సమయంలో తిరగడం ఏంటి.నీది ఏ కులం, బస్సు టికెట్లు చూపించాలంటూ నిలదీశారని, బైక్ పై వస్తున్నామని నా భార్య చెబితే ఇతను నీ భర్త అని గ్యారంటీ ఏంటని హేళనగా మాట్లాడారన్నారు.
పెళ్లి ఫోటోలు, తాళి బొట్టు చూపీంచినా కనికరించకుండా సుమారు అర గంట పాటు వారిని మనో వేదనకు గురిచేశారని వాపోయారు.
అనంతరం అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసుల పై మంత్రి కెటిఆర్, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎంఓ తో పాటు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు భాదితులు దుర్గారావు, భవానీ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు.
అలాగే ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్ కు ఫిర్యాదు చేసేందుకు సిపి కార్యాలయం ఆ దంపతులు చేరుకున్నారు.అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసారు.