ఆ పిచ్చుక రోడ్డుపై అల్లాడిపోతోంది.వడదెబ్బ తగిలిన దానిలా వణుకుతోంది.
తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్నాయి.వ్యక్తి ఇలా నీరు పోసి దానికి ఊరట కలిగించాడు.
దాహం తీర్చడమే కాదు… బాడీపై కూడా నీరు పోసి… సేదతీర్చాడు.అతను నీరు పోసేటప్పుడు అది ఎంత రిలాక్స్ ఫీలవుతోందో చూడండి.
ఇండియా కంటే చైనా ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాల్లో వాతావరణం ఒకటి అని చెప్పుకోవచ్చు.మన దేశంలో చలి కంటే ఎండ వాతావరణమే ఎక్కువ.మనం రోజూ 8 గంటలు పని చేయడమే కష్టం.అప్పటికే మన శరీరంలోని ఎనర్జీ మొత్తం వేడి వల్ల బయటకు పోతుంది.
అదే చైనాలో ఎన్ని గంటలు కష్టపడినా శ్రమ అనిపించదు.అక్కడి చల్లటి వాతావరణం వారికి అలసట లేకుండా చేస్తోంది.
ఇక ఎండాకాలం వచ్చిందంటే మన దేశంలో ఎండలు మండిపోతాయి.ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తాయి.
ఇప్పుడు అదే పరిస్థితి ఉంది.మనమే దాహంతో అల్లాడిపోతున్నాం… మరి మూగజీవాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి.
ఆ పిచ్చుక రోడ్డుపై అల్లాడిపోతోంది.వడదెబ్బ తగిలిన దానిలా వణుకుతోంది.పడిపోతున్నట్లు ఊగుతోంది.అతనెవరో గానీ… సరైన టైముకి దాన్ని చూశాడు.
వెంటనే దాహం తీర్చాడు.దాంతో అది కోలుకుంది.
రెక్కలున్న పక్షులు కూడా నీరు ఎక్కడుందో తెలియక.ఇలా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్నాయి.
ఈ జంతువు పేరు ఆర్మడిల్లో.దీనికి బలమైన బాడీ ఉన్నా.
ఎండ నుంచి మాత్రం తప్పించుకోలేకపోతోంది.దాహంతో అల్లాడుతుంటే… ఈ మంచి వ్యక్తి ఇలా నీరు పోసి దానికి ఊరట కలిగించాడు.
దాహం తీర్చడమే కాదు… బాడీపై కూడా నీరు పోసి… సేదతీర్చాడు.అతను నీరు పోసేటప్పుడు అది ఎంత రిలాక్స్ ఫీలవుతోందో చూడండి.

ఇదిగో ఈ వీడియో చూడండి.ఆ కోతులు ఎండతో అల్లాడిపోతున్నాయి.వాటికి దగ్గర్లో ఏ చెరువులూ కనిపించలేదు.మనమైతే స్నానం చేస్తాం.మరి వాటికి ఎలా.అందుకే అవి ఇలా వాటర్ ట్యాంకుల్లో నీటిలో జలకాలాడుతున్నాయి.ఒక్కసారి అలా నీటిలో మునిగి తేలితే ప్రాణం ఎటో పోతుందని అనుకుంటున్నాయి.ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ఘటనలు.కెమెరాలకు చిక్కనివి చాలా ఉంటున్నాయి.ఎంతో మంది మూగ జీవాలకు సాయం చేస్తున్నారు.
కొంతమంది ఇళ్ల దగ్గర గిన్నెల్లో నీరు పోసి పెడుతున్నారు.మరికొందరు చెట్లపై గిన్నెలు వేలాడదీసి నీరు పోస్తున్నారు.
ఏదో ఒక రకంగా ఎండల తాపం నుంచి ప్రాణులను కాపాడుతున్నారు.

ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా ఉన్నాయి.మార్చిలో ఈశాన్య భారత్లో 122 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎంతో చల్లగా ఉండే అక్కడే అలా ఉందంటే… ఇక వేడిగా ఉండే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
కంటిన్యూగా నీరు తాగుకూ, నీడలో ఉండేలా చూసుకోవాలి.ఎండలో ప్రయాణాలు తగ్గించుకోవాలి.తద్వారా వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు.







