టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటన వెళుతూ ఉంటారు.ఇలా తరచూ హాలిడే వెకేషన్ కి కుటుంబంతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
ఇలా ఒక వైపు సినిమాలలో బిజీగా ఉంటూ వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు తన కుటుంబం పారిస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నమ్రతా,తన కూతురు సితార కలిసి ప్యారిస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అదేవిధంగా సితార సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ క్యూట్ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోని సితార షేర్ చేస్తూ ఈఫిల్ టవర్ దగ్గర ఉన్నామంటూ క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.నిత్యం ఏదో ఒక వీడియోని షేర్ చేస్తూ ఇంత చిన్న వయసులోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఈ మధ్య కాలంలో వరుస డాన్స్ వీడియోలతో అభిమానులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈమె మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట చిత్రంలో సందడి చేయనున్నారు. ‘ఎవ్రీ పెన్ని’ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది.ఈ విధంగా సితార తన తండ్రితో కలిసి సర్కారీ వారి పాట చిత్రం ద్వారా వెండితెర ప్రేక్షకులను సందడి చేయనున్నారు.