నల్లగొండ జిల్లా:ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ మృతి చెందగా దశదినకర్మ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.నార్కట్పల్లిలోని రాశి ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్,మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ నేతలు నర్సింహకు నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడి,వారికి సానుభూతి తెలిపారు.వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 700 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.