సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచాయి.
ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.
ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యిందని.ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే.

అయితే లాస్ట్ సాంగ్ నిన్న స్టార్ట్ చేసి పూర్తి చేసినట్టు షూటింగ్ కు గుమ్మడికాయ కూడా కొట్టినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలోని 5వ క్రేజీ మాస్ సాంగ్ షూట్ పూర్తి అవడంతో ఈ సినిమా షూటింగ్ ముగిసింది.ఇలా దడపా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కీర్తి సురేష్ కూడా తన లాస్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.తాజాగా కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయ్యిందట.
కొని రోజుల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేయనుంది.దీంతో మేకర్స్ చిన్న చిన్న పనులను పూర్తి చేసి అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు.
దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







