మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ ఈ వయసులో కూడా అంతా యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.
ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.
ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇందులో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించాడు.చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
అయితే ఇప్పుడు చిరంజీవి కి అనూహ్య సంఘటన ఎదురైంది.ఈయన రిలీజ్ చేసే ముందు రోజు అంటే ఏప్రిల్ 28న నయనతార, సమంత నటించిన సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.
దీంతో స్టార్ హీరోయిన్ లకు, చిరంజీవి కి మధ్య పోటీ నెలకొంది.వీరిద్దరూ మొదటి సారి కలిసి నటించిన సినిమా కాతు వాకుల్ రెండు కాదుల్.ఈ సినిమా తెలుగులో కన్మణి రాంబో ఖతీజా అనే పేరుతొ వస్తున్నారు.
ఈ సినిమాను అంత తక్కువ అంచనా వేయలేము.ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోయిన్ లు కావడం అందులోను ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ గానే ఉంది.మన దగ్గర ఈ సినిమాను ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ లు వారి బుజాల మీద వేసుకుని మరీ మోయబోతున్నారు.
అయితే తమిళ్ లో మాత్రం వీరి కాంబో అంటే చాలా క్రేజ్ ఉంది.మరి వీరిద్దరూ కలిసి మెగాస్టార్ ను ఢీ కొట్టబోతుండడంతో ఏం జరుగుతుందా అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.