ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.
ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం గురించి చెప్పాల్సిన పని లేదు.

ఈయన తన సంగీతం తో సంచలనం సృష్టించాడు.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇంతటి భారీ విజయం నమోదు చేసుకుంది అంటే అందుకు కారణం దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా.పార్ట్ 2 లో కూడా తన పాటలతో మాయ చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు అని తెలుస్తుంది.
పుష్ప 2 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి టీమ్ అంతా సిద్ధంగా ఉంది.అల్లు అర్జున్ కూడా సిద్ధంగానే ఉన్నాడు.
కానీ ఈయన ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఫ్యామిలీ తో ఒక వెకేషన్ వెళతాడు అని తెలుస్తుంది.అందుకే ఈ సినిమాను జులై లో స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ మూడు నెలల్లో మిగతా వర్క్ అంతా పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్లనున్నారు.మరి చూడాలి ఈ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.







