ప్రజలపై ధరల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి:ఆర్.ఎస్.పి

నల్లగొండ జిల్లా:వంట గ్యాస్‌,పెట్రోల్‌,డీజిల్‌, నిత్యవసర వస్తువుల ధరలు,విద్యుత్,ఆర్టీసీ చార్జీలు పెంచి,పేదల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్‌.

 Central And State Governments Should Bring Down Prices On The People: Rsp-TeluguStop.com

ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో 27 వ రోజు యాత్ర కొనసాగించారు.ఈ సందర్భంగా యాత్ర కొనసాగే ప్రాంతాల్లో బీఎస్పీ జెండాలను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి,రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో పండిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిరకాల ధరలు పెంచుతూ పేద,మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు.అందుకే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రెండు ప్రభుత్వాలను రాబోయే ఎన్నికల్లో గద్దె దించి, బహుజన రాజ్యం కోసం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ రాజు,నల్లగొండ జిల్లా,మిర్యాలగూడ నియోజకవర్గ నేతలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube