యాదాద్రి జిల్లా:మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ గుట్ట ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను ఈవో గీతారెడ్డి పోలీసుల చేత అరెస్ట్ చేపించడం పట్ల యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట జర్నలిస్టులు నిరసనకు దిగారు.జర్నలిస్టుల నిరసనకు సంఘీభావం టీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ, సీపీఐ,సీపీఎం సహా అన్ని పార్టీల లీడర్లు జర్నలిస్టులకు సంఘీభావం తెలిపి ధర్నాలో కూర్చొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యాదాద్రి ఆలయ ఈఓ గుట్టపై ఇష్టారాజ్యంగా ఆంక్షలు విధిస్తూ గుట్ట తన సొంత ఆస్తిలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఆలయ నియమాలు పాటించకుండా ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
అన్ని వర్గాల ప్రజల,భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నడుచుకుంటున్న ఈఓ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.







