ఎన్టీఆర్ వర్ధంతి నాడు టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ..

కృష్ణాజిల్లా: తిరువూరు మండలం రాజవరం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి నాడు టిడిపి, వైసిపి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైనం.అధికారపార్టీ అక్రమ అరెస్ట్ లకు గురై నూజివీడు సబ్ జైలులో వున్న టిడిపి నాయకులను పరామర్శించేoదుకు వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శావధత్, టిడిపి నాయకులు, కార్యకర్తలు.

 Fight Between Tdp And Ycp Leaders On Ntr Death Anniversary In Krishna District D-TeluguStop.com

కోవిడ్ అంక్షల దృష్ట్యా ఖైదీల వద్దకు అందరికీ అనుమతి నిరాకరించి ముగ్గురిని అనుమతించిన జైలు అధికారులు.

సబ్ జైల్లో ఉన్న ముద్దాయి పరామర్శించిన కేసినేని నాని మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు అరెస్టులు చేసే కొద్దీ కార్యకర్తలు, టిడిపి నాయకులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి శూన్యం,కనీసం మూడు గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడా.వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం అప్పుడు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు తగిన బుద్ధి చెబుతాం.

అక్రమ అరెస్టు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube