కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆయన మరణానంతరం ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్.
ఈ సినిమా ఈయన పుట్టిన రోజు సందర్భంగా గత నెల థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇక పునీత్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.
చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పునీత్ సోదరులు రాఘవేంద్ర రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.పునీత్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది.
థియేటర్ లో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని సోనీ లైవ్ లో ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నారు.

ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది.కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ కీలక పాత్రలో నటించారు.శ్రీకాంత్ మేక, అను ప్రభాకర్, ముఖేష్ రిషి కీలక పాత్రలలో నటించారు.థియేటర్ లో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో తెలియాల్సి ఉంది.







