బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా అమితాబ్ నటించిన “ఝుండ్” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా విడుదల కాగా, సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ప్రస్తుతం అమితాబ్ ఏడు పదుల వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్-ప్యాక్డ్ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నారు.
ఈ యాడ్ షూట్ లో భాగంగా మూడు గాజు పలకలను పగలగొట్టాల్సి వచ్చింది.అయితే యంగ్ హీరోలు ఇలాంటి యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి డూప్ లను పెట్టుకుంటారు.
కానీ ఈ యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి అమితాబ్ ఎలాంటి డూప్ లేకుండా,తానే స్వయంగా స్టంట్స్ చేస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు.ఈ విషయాన్ని స్వయంగా ఈ యాడ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మనోహర్ వర్మ వెల్లడించారు.

ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే వయసుతో ముఖ్యం కాదని బిగ్ బీ మరోసారి నిరూపించుకున్నారు.వయసు కేవలం ఒక సంఖ్య అని అమితాబ్ తెలిపారు.అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని డైరెక్టర్ మనోహర్ వర్మ వెల్లడించారు.అమితాబ్ అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రన్వే 34 లో కీలక పాత్రలో నటిస్తున్నారు.







