బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ గా ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది.ఈ క్రమంలోనే ఈ షోలో రోజురోజుకు ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు, కంటెస్టెంట్ల మధ్య వింత వింత టాస్కులు.
ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక 17మంది కంటెస్టెంట్ ల తో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుని ముగ్గురు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.
ఇక నేటితో నాలుగవ వారం కూడా పూర్తి కానుంది.
ఇక పోతే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ టైటిల్ టార్గెట్ చేస్తూ తమ వంతు టాస్క్ లో పాటిస్పేట్ చేస్తూ ఒకరికొకరు గట్టిపోటీగా నిలుస్తున్నారని చెప్పాలి.
ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తన అంచనాల ప్రకారం బిందు మాధవి టైటిల్ దక్కించుకుంటుంది అంటూ బిగ్ బాస్ విజేత గురించి వెల్లడించారు.అయితే తాజాగా బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారనే విషయం గురించి బిగ్ బాస్ విశ్లేషకులు రివ్యూ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లకి ఆవకాయ బిర్యాని తినిపిస్తా అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ గేమ్ ఆడుతున్నారు.పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా టాస్క్ లలో ఎంతో చాకచక్యంగా ఆడుతూ తనపై ఎవరైనా లేనిపోని విమర్శలు చేసిన వారికి లెఫ్ట్ రైట్ ఇస్తూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న బిందు మాధవి ఈ సారి బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక బిందుమాధవి సైతం టైటిల్ దక్కించుకోవాలని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇదే కనుక నిజమైతే మొట్టమొదటిసారి తెలుగులో ఒక మహిళ కంటెస్టెంట్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న వారిగా బిందుమాధవి నిలబడతారు.







