కప్పను పూజించే ఈ ఆలయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

భారతదేశంలో జంతువులను పూజించే అనేక దేవాలయాలు ఉన్నాయి.ఇప్పుడు మనం భారతదేశంలో కప్పలను పూజించే ఏకైక ఆలయం గురించి తెలుసు కుందాం.

 Frog Temple Lakhimpur Kheri, Frog , Temple , Lakhimpur Kheri, Uttar Pradesh ,-TeluguStop.com

ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి వారు కప్పను ఎందుకు పూజిస్తారనే వివరాలు ఇప్పుడు తెలుసు కుందాం.భారతదేశం లోని కప్ప దేవాలయం ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్-ఖీరి జిల్లాలోని ఓయిల్ పట్టణంలో ఉంది.

ఈ దేవాలయం సుమారు 200 సంవత్సరాల నాటిదని చెబుతారు.కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడానికి ఈ ఆలయం నిర్మించారని చెబుతారు.

  శైవ శాఖకు ప్రధాన కేంద్రంగా నిలిచింది.ఇక్కడి పాలకులు శివుని ఆరాధకులు.

ఈ పట్టణం మధ్యలో ఒక పురాతన శివాలయం ఉంది.ఈ ప్రాంతం పద కొండవ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు చహమనా పాలకుల ఆధీనంలో ఉంది.

చహమనా రాజ వంశానికి చెందిన రాజా భక్ష్ సింగ్ ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు.ఆలయ నిర్మాణాన్ని కపిల తాంత్రికుడు చేపట్టాడు.

తాంత్రికత పై ఆధారపడిన ఈ ఆలయ నిర్మాణం దాని ప్రత్యేక శైలి కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.కప్ప గుడికి దీపావళితో పాటు మహా శివరాత్రి రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

లఖింపూర్ నుండి 11 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా లఖింపూర్ చేరుకుని టాక్సీని లో ఆలయానికి చేరేకోవచ్చు.మీరు విమానంలో రావాలను కుంటే.ఇక్కడి నుండి సమీప విమానాశ్రయం లక్నో 135 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ నుండి లఖింపూర్‌కు యూపీఎస్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube