ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు భారీగా పడిపోయిన రేటింగ్.. కారణం?

బుల్లితెరపై ఎన్టీఆర్వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న టువంటి కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులుఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం మొదటి వారాలలో అద్భుతమైన రేటింగ్ సంపాదించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మరొక సీజన్ ప్రారంభమైంది.

ఎన్నో అంచనాల నడుమ ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం మొదటివారం రేటింగ్స్ ఫర్వాలేదనిపించిన్నప్పటికీ ఆతరువాతవారాలురేటింగ్స్క్రమక్రమంగా పెరుగుతూ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకుంది.ఇలా వారం వారం రేటింగ్స్ పెరుగుతూపోతున్న ఈ కార్యక్రమంపై రేటింగ్స్ గురించి ఈ వారం కూడా నిర్వాహకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఈ కార్యక్రమం పై నిర్వాహకులు పెట్టుకున్న అంచనాలను ఈ కార్యక్రమం చేరుకోలేక రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని చెప్పవచ్చు.తాజాగా బార్క్ రిలీజ్ చేసిన రేటింగ్‌లో ఈ షోకు భారీ షాక్ తగిలింది.ఈ వారం ఏకంగా సగటున 4.70 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.ఇలా ఉన్నఫలంగా ఈ కార్యక్రమం రేటింగ్ తగ్గిపోవడానికి గల కారణం కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)అని చెప్పవచ్చు.

సరిగ్గా ఈ షో ప్రసారమయ్యే సమయానికి ఐపీఎల్ కూడా ప్రసారం కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఐపీఎల్ చూడటానికి ఆసక్తి చూపించటం వల్ల కార్యక్రమం రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు