ఏపీ ఉద్యోగుల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!!

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కొంత మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఏపీకి చెందిన ఉద్యోగస్తులు తెలంగాణ నుండి ఏపీ కి వెళ్ళిపోదామని.

అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో ఎక్కడ కూడా పరిస్థితులు కూలించలేదు.

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నుండి ఏపీ కి శాశ్వత బదిలీకి అనుమతి ఇవ్వటం జరిగింది.ఈ క్రమంలో శాశ్వత బదిలీకి విధివిధానాలు ఖరారు కూడా చేయడం జరిగింది.

ఏపీకి శాశ్వత బదిలీ దరఖాస్తు కు వచ్చే 15 వరకు గడువు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో క్రమశిక్షణా చర్యలువిజిలెన్స్ కేసులు పెండింగ్ లో ఉండకూడదు అని స్పష్టం చేసింది.

Advertisement

అంతేకాకుండా ఒక సారి రిలీవ్ అయ్యాక తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉండదు అని షరతులు విధిస్తూ బదిలీకి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెబుతూ ఏపీ ఉద్యోగస్తుల శాశ్వత బదిలీకి విధివిధానాలు స్పష్టం చేయడం జరిగింది.సచివాలయం తోపాటు అన్ని శాఖల కార్యదర్శులు దీన్ని అమలు చేయాలని స్పష్టం చేయడం జరిగింది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు