గత కొద్ది రోజుల నుంచి ఒక ప్రచారం జోరుగా కొనసాగుతోంది.అదే ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని.
ఇక దీనిపై వారిద్దరూ కూడా మాట్లాడకపోవడం, షర్మిల పార్టీపై జగన్ కూడా ఎలాంటి కామెంట్లు చేయకపోవడం, షర్మిల కూడా జగన్ను ఎన్ని తిట్టినా కూడా కనీసం స్పందించకపోవడం అనుమానాలకు తావిచ్చింది.ఇక షర్మిల కూడా దీన్నే కోరుకున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే వివాదాలు ఉన్నాయని ప్రజలు నమ్మితే తనను తెలంగాణ వాదిగానే గుర్తిస్తారని ఆమె నమ్మకం.
ఇదే విషయాలను మదిలో ఉంచుకుని అటు జగన్ గానీ, ఇటు షర్మిల గానీ మాట్లాడలేదు.
అంతే కాదు తమ తండ్రికి కూడా మొదటిసారి వేర్వేరుగా నివాళులు అర్పించారు.ప్రతిపక్షాలు మాత్రం వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని మొత్తుకుంటున్నాయి.ఇలాంటి సమయంలో అసలు విషయం చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం షాక్ ఇచ్చారు.సీఎం జగన్ కు షర్మిలకు మధ్య ఎలాంటి మనస్ఫర్థలు లేవని, వివాదాలు అనేవి ప్రచారం మాత్రమే అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.
మంచిగా కలిసున్న అన్నా, చెల్లెళ్ల మధ్య వివాదం తీసుకొచ్చి చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని కోరారు.అంటే మొత్తానికి షర్మిల వ్యూహంపై ఆయన నీళ్లు చల్లినట్టు అయింది.అన్నా, చెల్లెళ్లు వేరు కాదు ఒక్కటే అనే నినాదం ప్రజల్లోకి వెళ్తే షర్మిలపై ఆటోమేటిక్గా ఏపీ ముద్ర పడుతుంది.అప్పుడు తెలంగాణలో బలపడటం ఆమెకు చాలా కష్టం అవుతుంది.
మొత్తానికి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు షర్మిలకు పెద్ద ముప్పు తెచ్చాయని తెలుస్తోంది.మరి దీనిపై షర్మిల ఏమైనా స్పందిస్తుందా లేక సైలెంట్గా తన పని తాను చేసుకుని పోతుందా అనేది కొంత కాలం వేచి చూస్తేనే స్పష్టం అవుతుంది.