నారా లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన రోజా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కారణంగా టెన్త్.ఇంటర్ పరీక్షలు మొదటి నుండి రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ టిడిపి పార్టీకి చెందిన లోకేష్ ప్రభుత్వం పరీక్షల విషయంలో మొండిగా వ్యవహరించడం పట్ల తప్పుబడుతూ వెనక్కి తగ్గాలని పోరాటం చేస్తున్నారు.కాగా తాజాగా లోకేష్ అదే రీతిలో చంద్రబాబుపై పరీక్షల విషయంలో వైసీపీ పార్టీ నాయకురాలు ఎమ్మెల్యే రోజా సీరియస్ కామెంట్ చేశారు.

పరీక్షల రద్దు చేయాలని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే రీతిలో రాజకీయాలు చేస్తున్నారు తిన్నది అరగక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు.లోకేష్ అంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో విద్యార్థులు లోకేష్ మాదిరిగా చదువులో రాణించ కూడదు అన్న రీతిలో కోరుకుంటున్నారు అంటూ రోజా విమర్శించారు.పరీక్షల విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని .రోజా క్లారిటీ ఇచ్చారు.చదువు పరంగా భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా సరైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని వివరించారు.

Advertisement

విద్యార్థి జీవితంలో పరీక్ష అనేది లేకపోతే నారా లోకేష్ మాదిరిగా మొద్దు పిల్లలు మాదిరిగా తయారవుతారని రోజా సెటైర్లు వేశారు.అదే విధంగా జగన్ నీ పట్టుకుని మెంటల్ మామ అనే విమర్శలను ఖండించి జగన్ ని ప్రజలందరూ పిల్లలందరూ చందమామ అంటున్నారని రోజా చెప్పుకొచ్చారు.

 .

Advertisement

తాజా వార్తలు