రవితేజతో బ్రేక్ అప్ అయ్యి వరుణ్ తేజ్ తో టై అప్ అవుతున్న త్రినాధ్ రావు

మేం వయసుకి వచ్చాం అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ మొదలు పెట్టిన దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన.

మొదటి సినిమాతో లవ్ స్టొరీని భాగానే డీల్ చేసాడని పేరు తెచ్చుకున్న పెద్దగా సక్సెస్ దక్కించుకోలేదు.

అయితే రెండో సినిమాగా రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ అనే మూవీతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.ఈ మూవీకి త్రినాధ్ రావు కి సాయి ప్రసన్న అనే యంగ్ టాలెంటెడ్ రైటర్ జత కలిసాడు.

ఇక వీరిద్దరు మళ్ళీ నానితో నేను లోకల్ అనే మూవీ చేశారు.అది కూడా కమర్షియల్ హిట్ గా నిలిచి దర్శకుడు త్రినాధ్ రావుకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇక మూడో సినిమాని హీరో రామ్ తో హలో గురు ప్రేమకోసమే అంటూ రొమాంటిక్ లవ్ స్టొరీని ఆవిష్కరించారు.ఈ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.

Advertisement

అయితే ఆ మధ్య రవితేజతో అవుట్ అండ్ అవుట్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ కథ చెప్పి ఒకే చేయించుకున్నారు.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించడానికి ముందుకొచ్చింది.

రవితేజ కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు.అయితే ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ని అలా వెనక్కి నెడుతూ కొత్త ప్రాజెక్ట్స్ ని ముందుకి తీసుకోస్తున్నాడు.

త్రినాధ్ రావు కంటే లేట్ గా రమేష్ వర్మ కథని చెప్పిన, ముందుగా అతనితో ఖిలాడీ సినిమాని ముందుకి తీసుకొచ్చి షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు.ఇప్పుడు శరత్ మండవ దర్శకత్వంలో ఒక సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.

ఈ మూవీ తర్వాత కూడా త్రినాధ్ రావుతో స్టార్ట్ చేస్తాడా అంటే ఎలాంటి ఆన్సర్ లేదు.ఈ నేపధ్యంలో దర్శకుడు త్రినాధ్ రావు కూడా రవితేజకి వదిలేసి అదే కథని మెగా హీరో వరుణ్ తేజ్ కి వినిపించినట్లు తెలుస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక వరుణ్ తేజ్ కూడా వారి కథ నచ్చి ఒకే చెప్పినట్లు బోగట్టా.నిర్మాత మారకపోయినా హీరోగా రవితేజ ప్లేస్ లోకి వరుణ్ తేజ్ వచ్చి చేరాడని టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు