బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు.. ?

రాజకీయాల్లో ర్యాగింగ్ వంటివి లేకపోయిన గ్రూపు రాజకీయాలు మాత్రం తప్పని సరిగా ఉన్నాయి అని ఇప్పటికే ఎందరో నేతలు నిరూపించారు.

ఇక పదవుల కోసం ఎంతటి నీచానికైన దిగజారుతారని ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే అర్ధం అవుతుంది.

ప్రజాసేవ ముసుగులో జరుగుతున్నపెద్ద మోసానికి కేరాఫ్ అడ్రాస్ నేటి రాజకీయాలని చెప్పవచ్చూ.ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఈటల బర్తఫ్ పెద్ద సంచలనమే సృష్టించింది.

ఈయన విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేతల ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈటల బీజేపీలో చేరితే కొందరు పార్టీని వీడే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా అన్ని పార్టీల్లో ఉన్నట్టే బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలు ఉన్నాయని, కానీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు మాత్రం స్థానం లేదని వివరించారు.ఇక తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ అధిష్ఠానం కృషి చేస్తోందని.

Advertisement

ఇలాంటి సమయంలో ఈటల పార్టీలోకి రావడం వల్ల పార్టీకే బలమని రాజాసింగ్ వెల్లడించారు.కాబట్టి ఎవరు ఈటల రాకను వ్యతిరేకించినా తుది నిర్ణయం తీసుకునేది పార్టీ హైకమాండ్ మాత్రమేనని తెలిపారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు