గొప్ప మనసు చాటుకున్న రియల్ హీరో సోనూసూద్...ఏం చేసాడంటే?

ప్రస్తుతం కరోనా దేశంలో ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.మొదటి కరోనా వేవ్ కంటే రెండో కరోనా వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్నది.

మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు మాత్రం కొద్దిగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో దీనికంటే పూర్తి భిన్నంగా కేసులు భారీగానే నమోదవుతున్నా, మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి.

ఇక కరోనా దెబ్బకు ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డ పరిస్థితి ఉంది.అయితే ఈ సమయంలోనే మొదటి వేవ్ సమయంలో తన స్వంత ఖర్చులతో వలస కార్మికులకు బస్సు వేయించి రియల్ హీరోగా దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడం జరిగింది.

ఇక సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి ఆక్సిజన్ ను అందిస్తూ, ఎక్కడ ఎవరికీ ఎటువంటి సహాయం ఉన్నా ట్వీట్ చేస్తే ఆ సమస్యను తీరుస్తున్నాడు సోనూసూద్.ఇక తాజాగా సోనూసూద్ తీసుకున్న ఓ నిర్ణయం ఒక్కసారిగా దేశ ప్రజలను అవాక్కయ్యేలా చేసిందని చెప్పవచ్చు.

Advertisement

మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఇంటి వద్దకే ఆక్సిజన్ పంపిస్తా అంటూ ప్రకటన విడుదల చేసాడు సోనూసూద్.ఇక ఒక్కసారిగా ప్రభుత్వం ఒకవైపు, సోనూసూద్ ఒకవైపు ఉన్న పరిస్థితి ఉంది.

ప్రభుత్వంపై నమ్మకం లేక సోనూసూద్ ఫౌండేషన్ కు ప్రజలు విరాళాలు  అందజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు