బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 15 నుండి 21 వరకు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం.. !?

కరోనా కొన్ని రాష్ట్రల్లో మళ్లీ తన ప్రతాపాన్ని చూపెట్టడానికి సిద్దం అయ్యిందన్న విషయం విదితమే.కాగా ఊహించని విధంగా కొన్ని రాష్ట్రల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

 Maharashtra Government Again Imposed Lockdown In Nagpur Due To Corona Effect , M-TeluguStop.com

ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది.కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలను ఈ వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది.

దాంతో కేంద్రం అప్రమత్తం అయి రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా టెస్ట్‌లతో పాటుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కూడా పెంచాలంటూ కేంద్రం సూచించింది.

కాగా ఏడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని ఆ రాష్ట్రాల్లో 90శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ క్రమంలో మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్, కారణంగా నాగపూర్ లో ఈ నెల 15 నుండి 21 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడింది.

ఇకపోతే దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.ఆ తర్వాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube