త్రీరోజెస్ వెబ్ సిరీస్ కోసం మారుతీతో కలిసిన కాజల్ అగర్వాల్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్.

ఈ అమ్మడు తన 13 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరియర్ లో ఇప్పటికే అదే రేంజ్ లో సినిమాల పరంగా తన హవా కొనసాగిస్తుంది.

అయితే ఇప్పుడు రెగ్యులర్ హీరోయిన్ పాత్రలతో పాటు కొత్తదనం ఉన్న కథలు కూడా చేయడానికి ఒకే చెబుతుంది.లాక్ డౌన్ కాలంలో తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న అమ్మడు భర్తతో హనీమూన్ డేస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి మరల ఇప్పుడు సినిమా షూటింగ్ లతో బిజీ అయిపొయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఆచార్య సినిమా షూటింగ్ లో ఉంది.ఇదిలా ఉంటే ఈ మధ్య సౌత్ భామలు డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు.

తమన్నా, సమంత తరహాలోనే లైవ్ టెలికాస్ట్ అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించింది.ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ తెలుగు వెబ్ సిరీస్ చేయడానికి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.టాలెంటెడ్ దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు త్రీరోజెస్ అనే వెబ్ సిరీస్ ని కూడా స్టార్ట్ చేశాడు.రొమాంటిక్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.

ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి కాజల్ అగర్వాల్ ఒకే చెప్పింది.ఈ వెబ్ సిరీస్ ని తెలుగు ఒటీటీ ప్లాట్ ఫాం ఆహా ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు