మళ్లీ దొరబాబు పరువు తీసిన రోజా.. జైలు అలవాటైందంటూ..?

బుల్లితెరపై ఎన్ని కామెడీ షోలు ఉన్నా జబర్దస్త్ షో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే.

సంవత్సరాలు గడుస్తున్నా ఈ కామెడీ షోకు ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి రోజా, నాగబాబు జడ్జీలుగా ఉండగా కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ షోకు దూరమయ్యారు.ప్రస్తుతం రోజా, మనో ఈ షోకు జడ్జీలుగా ఉన్నారు.

జడ్జీ రోజా స్కిట్ల మధ్యలో పంచ్ లు వేస్తూ జబర్దస్త్ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు.తాజాగా ఈ నెల 21వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది.

స్కిట్ లో రైజింగ్ రాజు శాంతి స్వరూప్ తో సుధీర్ ది రష్మీది 8 సంవత్సరాల ప్రేమ మనది ఎనిమిన్నర సంవత్సరాల ప్రేమ అని చెబుతాడు.లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ వాళ్లను చూస్తే ఏం జంట అంటారు మనిద్దరినీ చూస్తే అని చెబుతుండగానే రోజా ఏమి జంట అంటూ పంచ్ వేశారు.

Advertisement

ఆ తరువాత హైపర్ ఆది ఎంట్రీ ఇస్తాడు.

రైజింగ్ రాజు మేమిద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పగా ఆది 2021 బాగుంటుందని అన్నారు 2021 కూడా డేంజర్ జోన్ లోనే ఉంది అని చెబుతాడు.ఆ తరువాత దొరబాబు స్కిట్ లో దొరబాబును చూసి పోలీస్ గెటప్ ఉన్న వ్యక్తి ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేస్తా అంటాడు.దొరబాబు వేయడం మీకు కొత్తేమో కానీ అంటుండగానే రోజా మధ్యలో అందుకుని వాళ్లకు అలవాటైపోయిందని పంచ్ వేశారు.

రోజా అలా పంచ్ లు వేయడంతో జబర్దస్త్ షోలో అందరూ నవ్వేశారు.గతంలో ఒకసారి దొరబాబు పోలీసులకు పట్టుబడటంతో హైపర్ ఆది ఎప్పుడూ తన స్కిట్లలో పంచ్ లు వేసేవారు.

అయితే ఈసారి రోజా దొరబాబుపై పంచ్ వేసి దొరబాబు పరువు తీశారు.అయితే జబర్దస్త్ షోలో సరదా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కోసమే పంచ్ లు వేస్తారు కాబట్టి ఆ పంచ్ లను ఎవరూ సీరియస్ గా తీసుకోరు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు