తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సమంత సామ్ జామ్ టాక్ షో హైప్ పెంచేందుకు మెగాస్టార్ చిరంజీవి.అల్లు అర్జున్ వంటి స్టార్స్ ను తీసుకు వచ్చారు.
అయితే చిరంజీవి ఎపిసోడ్ షూట్ చేసి నెల గడుస్తున్నా కూడా స్ట్రీమింగ్ చేయక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అసలు చిరంజీవి సామ్ జామ్ షో ఉందా లేదా అనుకుంటూ ఉండగా క్రిస్మస్ కానుకగా షోను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
చిరంజీవి ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రిస్మస్ రోజున చిరంజీవి సామ్ జామ్ షో స్ట్రీమింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఇటీవలే అల్లు అర్జున్ మరియు సమంతల సామ్ జామ్ షో కూడా జరిగింది.
వీరిద్దరి కాంబోలో షో ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.అయితే అనూహ్యంగా ఈ వారంలో అల్లు అర్జున్ గెస్ట్ గా రావడం లేదు.ఈ వారంలో సమంతతో క్రిష్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు ముచ్చటించబోతున్నారు.
వీరిద్దరు కలిసి సమంతతో ఎంతటి ఎంటర్టైన్మెంట్ను ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే షూటింగ్ జరిపిన అల్లు అర్జున్ ఎపిసోడ్ ను సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
వరుసగా ఆహాలో పెద్ద స్టార్స్ ను తీసుకు రావడం వల్ల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఆహా లో ఈ శుక్రవారం రకుల్ క్రిష్ రానుకగా తదుపరి శుక్రవారం చిరంజీవి రాబోతున్నాడు.
ఆ తర్వాత ఒక స్టార్ ను తీసుకు వచ్చా ఆ తర్వాత వారంలో బన్నీ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.చిరంజీవి ఎపిసోడ్ మాదిరిగానే బన్నీ ఎపిసోడ్ ను కూడా హోల్డ్ చేసి మరీ స్పెషల్ రోజున స్ట్రీమింగ్ చేయబోతున్నారు.