తేజ్ సినిమా మొత్తం హక్కులు తీసేసుకున్న జీ5

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సోలో బ్రతుకే సో బెటరు.

ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది.అయితే చిత్ర యూనిట్ మాత్రం ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదనే నేరుగా థియేటర్స్ లోనే సినిమా రిలీజ్ ఉండబోతుంది అని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ నుంచి సడలింపులు కూడా ఇవ్వడంతో పాటు థియేటర్లు ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేశారు.అయితే 50 పెర్సెంట్ ఆక్యుపెన్సీతోనే థియేటర్లు ఓపెన్ చేయాలని నిబంధనలు పెట్టారు.

Advertisement

ఈ నేపధ్యంలో థియేటర్ యాజమానులు కొన్ని రోజులు వేచి చూశారు.మల్టీప్లెక్స్ థియేటర్స్ వరకు ఓపెన్ అయ్యాయి.

అయితే థియేటర్లుని డిసెంబర్ లో పూర్తి స్థాయిలో ఓపెన్ చేయబోతున్నారు.దీనికి కారణం డిసెంబర్ నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్నాయి.ఈ నేపధ్యంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ థియేటర్ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమా కాబోతుంది.జీ5 ఈ సినిమాకి సంబంధించి పూర్తి హక్కులని సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో జీ5 నేరుగా సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనుంది.

తరువాత థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ చూసుకొని ఓటీటీ ప్రీమియర్ ప్లాన్ చేయబోతున్నారు.థియేటర్స్ లో ప్రేక్షకులు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపించకపోతే వీలైనంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు, థియేటర్స్ లో రెస్పాన్స్ బాగుంటే కాస్తా లెట్ గా ఓటీటీ ప్రీమియర్ ప్లాన్ చేసే యోచనలో ఉన్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు